Latest News

బాయ్ ఫ్రెండ్ దగ్గరికి పంపాలంటూ, హైదరాబాద్ పోలీసుల వద్ద యువతి పంచాయితీ!

loading...
ఓ వైపు కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ, హైదరాబాద్ పోలీసుల ముందుకు ఓ విచిత్రమైన కేసు రాగా, ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. తనకు బాయ్ ఫ్రెండ్ ను చూడాలని ఉందని, అతని వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీసుల వద్దకు వచ్చింది.

వివరాల్లోకి వెళితే, అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో నివాసం ఉంటున్న ఓ యువతి ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు సదరు యువకుడు, ఆమె వద్దకు రాగా, చుట్టుపక్కల వారు పట్టుకుని, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు తమ బిడ్డను యువకుడు వేధిస్తున్నాడంటూ, పోలీసు కేసు పెట్టారు. పోలీసులు అతన్ని విచారించగా, ఆమెపై తనకు ప్రేమ లేదని, ఆ విషయాన్ని స్పష్టం చేసేందుకే వచ్చానని చెప్పాడు. దీంతో అతన్ని హెచ్చరించిన పోలీసులు పంపించి వేశారు.

ఆ తరువాత అతని ప్రియురాలు పోలీసుల వద్దకు వచ్చింది. తాను యువకుడిని కలవాల్సిందేనని భీష్మించుకు కూర్చుంది. తనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, స్టేషన్ లోనే బైఠాయించింది. ఉన్నతాధికారులు, ఆమెకు లాక్ డౌన్ నిబంధనల గురించి వివరించి, సర్దిచెప్పి, ఈ తరహా ప్రవర్తన కూడదని సర్ది చెప్పి పంపించారు.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.