Latest News

కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

loading...


హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌శాఖలో 9 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన తుది రాతపరీక్ష ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసినట్టు పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు చైర్మన్ జే పూర్ణచందర్‌రావు తెలిపారు. గతనెల 23న ఎస్పీఎఫ్, ఫైర్‌మెన్ సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్ తదితర విభాగాల్లో కానిస్టేబుళ్లు, తత్సమాన ర్యాంక్ సిబ్బంది నియామకానికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ WWW.TSLPRB.IN లో ఫలితాలు చూసుకోవాలని పూర్ణచందర్‌రావు తెలిపారు. ఫలితాల్లో ఎలాంటి సందేహాలున్నా, ఓఎమ్మార్ సమాధాన పత్రాలను చెక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 8వ తేదీ లోపు నిర్ణీత ఫీజు చెల్లించి తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2 వేలు, మిగితా క్యాటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించి ఒరిజినల్ ఓఎమ్మార్ సమాధాన పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.