Latest News

ఇంటి యజమాని వేధింపులు భరించలేక ఓ వివాహిత్ ఆత్మహత్య

loading...

హైదరాబాద్: నగరంలోని కూకట్ పల్లి లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి యజమాని వేధింపులు భరించలేక ఓ వివాహిత్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం ఉదయం కూకట్‌పల్లి మెడికల్ సొసైటీలో చోటుచేసుకుంది. స్థానిక ప్రసన్న కుమార్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో పాలకొల్లుకు చెందిన రామకృష్ణ, సుజాత దంపతులు రెండున్నర సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నారు. వీరికి మూడు, ఒకటిన్నర సంవత్సరం వయసున్న ఒక బాబు, పాప ఉన్నారు. పిల్లలు గొడవ చేస్తున్నారంటూ ఓనర్ గొడవపెట్టుకున్నాడని సుజాత బంధువులు చెబుతున్నారు. ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఓనర్ గొడవకు దిగడంతో మనస్థాపానికి గురైన సుజాత ఇంట్లో ప్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని వారు పోలీసులకు తెలిపారు. కూకట్‌పల్లి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన చావుకు ఇంటి యజమాని కారణమంటూ ఇంట్లో గోడలు, తలుపులపై రాసి సుజాత ఆత్మహత్యకు పాల్పడింది. 
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.