Latest News

క్వాంటిటేటివ్ ఈజింగ్ - హెలికాప్టర్ మనీ అంటే ఏమిటి...?

loading...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో విడియో కాన్ఫరెన్స్ సందర్భంగా, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినందున, క్వాంటిటేటివ్ ఈజింగ్ - హెలికాప్టర్ మనీ పద్ధతులను అవలంబించి రిజర్వు బ్యాంకు ద్వారా నిధులు అందజేయాలని కోరారు. అసలు ఈ రెండు పద్ధతులు ఏమిటి? వీటిని ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.

క్వాంటిటేటివ్ ఈజింగ్.. ఇది ఒక ద్రవ్య విధానం. ఏదైనా దేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చులు రాబడి కంటే విపరీతంగా పెరిగిపోయి, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారినప్పుడు, తన వద్ద ఉన్న బాండ్లను, ఇతర ఆర్థిక ఆస్తులను అమ్మి, ఆ లోటును పూడ్చుకోవడమే క్వాంటిటేటివ్ ఈజింగ్.

ఈ పద్ధతిలో ఆ బాండ్లను కొనవలసింది భారత రిజర్వ్ బ్యాంకు. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా లభించే ఈ సంపదను రాష్ట్రం తన ఆర్థిక వ్యవస్థలోకి పంపి, ప్రజల కొనుగోలు శక్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక సంతులతను స్థిరీకరిస్తుంది. సాధారణంగా ఈ పద్ధతిని ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నప్పుడు వాడటం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతారు.
అదనంగా డబ్బు మార్కెట్లోకి రావడం వల్ల ద్రవ్యలభ్యత ఎక్కువవుతుంది. రుణాల లభ్యత చాలా సులభంగా ఉంటుంది. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని, కొనుగోలు శక్తిని పెంచుకుంటారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదురుకుంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లంటే, తన స్వంత ఆర్థిక ఆస్తులన్నమాట. వీటినే 'స్టేట్ డెవలప్‌మెంట్‌ లోన్స్' గా కూడా వ్యవహరిస్తారు. ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందుగా ఒప్పుకున్న శాతాన్ని చెల్లిస్తూ, చివరికి అసలు మొత్తాన్ని చెల్లించడమే ఈ పద్ధతి. ఉదాహరణకు, ఒక రాష్ట్రం ఓ పది కోట్లకు బాండ్‌ను విడుదల చేస్తే, రిజర్వ్ బ్యాంకు దాన్ని 10శాతం వార్షిక చెల్లింపు నిబంధన కింద 10 సంవత్సరాలకు తీసుకుందని అనుకుందాం. అంటే, ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఆ రాష్ట్రం చెల్లిస్తూ, పదేళ్లు నిండాక అసలు మొత్తం పది కోట్లు చెల్లించాల్సిఉంటుంది. ఇదే క్వాంటిటేటివ్ ఈజింగ్.
ఈ పద్ధతిని ముందుగా జాన్ మేనార్డ్ కేన్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడని అంటారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ ముందుగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని అమెరికా, యూరప్‌లలో అవలంబిస్తున్నారు.

హెలీకాప్టర్ మనీ:

హెలీకాప్టర్ మనీ అనేది క్వాంటిటేటివ్ ఈజింగ్‌తో పోలస్తే భిన్నమైనదీ, అరుదైనది కూడా. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయి, ప్రజల కొనుగోలు శక్తి శూన్యమయినప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కేంద్ర బ్యాంకు ప్రజలకు (వినియోగదారులకు) నేరుగా డబ్బు పంపిణీ చేస్తుంది. అంటే, మన బ్యాంకు అకౌంట్‌లో లక్షలకులక్షలు వచ్చి పడటం కాదు కానీ, ఇంచుమించు అలాంటిదే.
ప్రజల ఆదాయం, ఖర్చుల కంటే తగ్గిపోయినప్పుడు వారేది కొనడానికి ఆసక్తి చూపరు. అలా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఉత్పత్తుల ధరలు పడిపోతాయి. దీన్నే ప్రతిద్రవ్యోల్బణం లేదా డిఫ్లేషన్ అంటారు. దీన్ని నివారించాలంటే, ప్రజలకు అయాచితంగా డబ్బు అందాలి. దాంతో వారు మార్కెట్ల మీద పడి, విపరీతంగా కొనుగోలు చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు భారీగా ప్రవేశించి సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది. హెలీకాప్టర్ ద్వరా డబ్బు వెదజల్లితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే ఈ ద్రవ్య విధానానికి ఈ పేరు పెట్టారు.
మరి అలా నేరుగా డబ్బును ప్రజలకే పంపాలంటే ఎలా? ఏదైనా తప్పనిసరి చెల్లింపును రద్దు చేయడం. ఉదాహరణకు మన ఆదాయపు పన్నును కొంత కాలం పాటు రద్దు చేయడం. ఇలా చేయడం వల్ల మన ప్రతీ ఏడాది చెల్లిస్తున్న పన్ను ఇక ఆపేయవచ్చు. దాంతో మనకు చాలా మొత్తం మిగులుతుంది. దాన్ని ఖర్చు చేయడం కోసం కొనుగోళ్లు చేస్తాం. అంతే.

1969లో అమెరికా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్‌మన్ ఈ విధానాన్ని ప్రతిపాదించగా, 2002లో మరో ఆర్థికవేత్త బెన్ బెర్నాంకె దానికి మెరుగులు దిద్ది, ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు.
loading...

No comments:

Post a Comment

Teenmar News | Online English, Telugu,Telangana News Portal Designed by Templateism.com Copyright © 2014

Powered by Blogger.